మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిధిగా ఘనంగా జరిగిన సినిమాటిక్ ఎక్స్ పో 2025
హాలీవుడ్ టు టాలీవుడ్ అనే కాన్సెప్ట్ తో సినిమాలో సాంకేతికత, సృజనాత్మకత, కొత్త ఆవిష్కరణలను పరిచయం చేయడానికి సినిమాటికా ఎక్స్పో ద్వారా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పి.జి విందా ముందుకొచ్చారు. అదే దిశలో సినిమాటికా ఎక్స్పో 2025 సినిమా భవిష్యత్తుకి వేదికగా ముందుకు సాగుతోంది. హైదరాబాద్ హైటెక్ సిటీలోని నవోటెల్ HICCలో “ సినిమాటికా ఎక్స్పో 2025” మొదటి రోజు ప్రాంభండంగా జరిగింది. ‘సినిక క్రియేటర్స్ కౌన్సిల్’ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో, తెలంగాణ ప్రభుత్వ మద్దతుతో, IndiaJoy సహకారంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికిి తెలంగాణ ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, హీరో తేజ సజ్జ , సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్, నిర్మాత దిల్ రాజు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ మొంబర్ దామోధర్ తదితరలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దిల్ రాజు మాట్లాడుతూ.. సినిమాటికా ఎక్స్పో 2025 కార్యక్రమానికి వచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపారు. నరసింహా మహావతార్ సినిమా ఎంత అద్భుతం క్రియేట్ చేసిందో చెప్పారు.
ఐటీ మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఇండియాజాయ్ సహాకారంతో సినిమాటికా ఎక్స్ పో కార్యక్రమం ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా జరగడం సంతోషం అన్నారు. క్రియేటర్స్, యాక్టర్స్, గేమర్స్, ఇన్విస్టేర్లు అందరూ ఈ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ రోజు టెక్నాలజీ ఎంతగానో పెరిగిపోయిందన్నారు. మొదటి ఆధార్ కార్డు వచ్చినప్పుడు విషయాలను పంచుకున్నారు. హైదరాబాద్ ఇప్పుడు గ్లోబల్ హబ్ గా మారిపోయిందన్నారు. ఇరానీ చాయ్ హోటల్ నుంచి ఫైవ్ స్టార్ హోటల్ వరకు అన్ని సౌఖర్యాలు ఉన్నాయన్నారు. అలాగే క్రియేటివీటికి సంబంధించిన అన్ని అంశాలు హైదరాబాద్ లో అందుబాటులో ఉన్నాయన్నారు. నేర్చుకోవాలి అనుకునే వారికి మల్టీమీడియా, వీఎఫ్ ఎక్స్, గ్రాఫిక్స్ అన్ని విషయాల్లో హైదరాబాద్ దూసుకెళ్తుందని పేర్కొన్నారు. ఇండియాలో 25 శాతం విఎఫ్ఎక్స్ హైదరాబాద్ లో రెడీ అవుతుందని చెప్పారు. సిటీలో మొత్తం 400 వీఎఫ్ఎక్స్ కంపెనీలు ఉన్నాయని తెలిపారు. అలాగే 200 పైగా ఏవీజీసీ స్టూడీయోలను ఓటీటీ, గేమింగ్, ఫిల్మ్స్ కోసం క్రియేట్ చేసినట్లు చెప్పారు. అలాగే ఏఐ కి సంబంధించిన కంపెనీలను నెలకొల్పినట్లు చెప్పారు. 25 దేశాల్లో 30 వేల మంది క్రియేటర్లను 500 కంపెనీలను నెలకొల్పిన ఇండియా జాయ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మూవీ ఫీల్డ్ కు వచ్చే చాలా మందికి ఈ వేదిక ఎంతో ప్రోత్సాహం ఇస్తుందని మంత్రి చెప్పారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న హీరో తేజ సజ్జ మాట్లాడారు. ప్రస్తుతం సినిమాలో వీఎఫ్ఎక్స్ ప్రముఖ పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఈ వేదిక ద్వారా కొత్త సాంకేతిక నిపుణులు, క్రియేటర్స్ పరిశ్రమకు వస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలను తలపించేలా ఇండియన్ సినిమా రూపోందుతున్నాయని, ఇకపై హాలీవుడ్ టెక్నిషన్స్ కూడా హైదరాబాద్ వైపు చూసేలా ఒక ప్రయత్నం మొదలు పెట్టడం, దానికి సినిమాటికా ఎక్స్ పో ముందుకు తీసుకెళ్లడం సంతోషంగా ఉందన్నారు. చాలా సినిమాలు వీఎఫ్ఎక్స్ మన హైదరాబాద్ లో జరుగుతున్నాయని ఇకపై అన్ని సినిమాలు ఇక్కడే వీఎఫ్ఎక్స్ జరిగేందుకు ఈ వేదిక కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రొత్సహించడానికి వచ్చిన ప్రతీ ఒక్కరికి థ్యాంక్స్ చెప్పారు.
ఈ సంవత్సరం “From Hollywood to Hyderabad: Building the Global Gateway of Cinema.” అనే థీమ్ తో ముందుకెళ్తున్నట్లు పి.జి విందా తెలిపారు.
ఇది కేవలం నినాదం కాదు, భారతీయ సినిమాను గ్లోబల్ వేదికపై నిలబెట్టాలనే ప్రయత్నం అని చెప్పారు. సినిమా, టెక్నాలజీ, ఆర్ట్, కల్చర్లను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, భారత సినిమా పరిశ్రమలో సాంకేతిక విప్లవానికి మార్గదర్శకంగా నిలవడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం ముందుకు వెళ్తుందని పి.జి విందా చెప్పారు. ఈ కార్యక్రమానికి మంచి రెస్పాన్స్ వస్తుందన్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం గొప్ప ప్రోత్సాహం అందించిందన్నారు.

















No comments