మాధురి రాథోడ్ లేటెస్ట్ సాంగ్ ‘రాయే లచ్చిమి ’ విడుదల !!!
మాధురి రాథోడ్ ఒక ప్రముఖ తెలంగాణ జానపద గాయని, నర్తకి మరియు సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్, ఆమె తన అద్భుతమైన జానపద పాటలు, డ్యాన్స్ వీడియోల ద్వారా యూట్యూబ్ మరియు ఇన్స్టాగ్రామ్లో మిలియన్ల కొద్దీ అభిమానులను సంపాదించుకుంది. ఆమె పాడిన "నిమ్మతోట వనములో" లాంటి పాటలు చాలా ప్రాచుర్యం పొందాయి.
తాజాగా మాధురి రాథోడ్ జి శివకుమారి నాయుడు నిర్మాణంలో నవీన్ జె సంగీతంలో తాడూరి జయరాజ్ సాహిత్యంలో ప్రభ మరియు రాము పాడిన ‘రాయే లచ్చిమి ’ ఫుల్ సాంగ్ విడుదల అయ్యింది, ఈ సాంగ్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది.
డి అరుణ్ కోలుగురి సినిమాటోగ్రఫీ మరియు ఎడిటింగ్ చేసిన ఈ సాంగ్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో గ్రాండ్ గా జరిగింది, పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో నిర్మాత జి శివకుమారి మాట్లాడుతూ ‘రాయే లచ్చిమి సాంగ్ ప్రోమోకు మంచి ఆధారణ లభించింది, సాంగ్ కూడా అదే విధంగా సూపర్ హిట్ అవుతుందని నమ్ముతున్నాము’ అన్నారు.

No comments