తప్పు చేసినవాడు సొంత పార్టీ కార్యకర్త అయినా వదిలిపెట్టే ప్రసక్తే లేదు- సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ గారు
తప్పు చేసినవాడు సొంత పార్టీ కార్యకర్త అయినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని మరోసారి నిరూపించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ గారు.
గుంటూరులో మహిళపై జరిగిన దాడి ఘటనను ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించింది. ఎమ్మెల్యే గల్లా మాధవి గారు విడుదల చేసిన లేఖలో పేర్కొన్నట్లుగా, ఘటనలో ప్రమేయం ఉన్న వ్యక్తిని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి వెంటనే సస్పెండ్ చేశారు.
ఇప్పటికే నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదు చేసి పోలీసులు అరెస్టు చేశారు. మహిళల భద్రత విషయంలో రాజీ లేదని, తప్పు చేసినవాడు ఎవరైనా, సొంత పార్టీ కార్యకర్త అయినా కఠిన చర్యలు తప్పవని సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ గారు మరోసారి స్పష్టం చేశారు.
మహిళలపై చేయి వేయాలంటే ఇకపై ఎవరైనా భయపడాల్సిందే... చట్టం ముందు అందరూ సమానమే.

No comments